నంద్యాల పట్టణం శ్రీ చంద్రశేఖర కాళికాంబ దేవస్థానం నందు గీత గోవిందం సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల విద్యార్థులకు శ్రీమధ్ భాగవతంపై అవగాహన పరీక్ష నిర్వహించారు.ఈమేరకు ఆదివారం విజేతలకు బహుమతులు అందజేసినట్లు నిర్వాహకులు సత్యనారాయణ తెలిపారు.

ప్రతినెల విద్యార్థులకు ఇతిహాసాలు,పురాణాలపై అవగాహన కల్పించేందుకు పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.గోస్పాడు చిరుధాన్యాల ఉత్పత్తి దారుల కంపెనీ,శమంతకమణి గోఆధారిత ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల అంగడి అధినేత చంద్రశేఖర్ రెడ్డి,మణి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అధినేత నాగేంద్ర లు సహకరించినట్లు తెలిపారు
Leave a Reply