ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధేశాల మేరకు భారత ప్రభుత్వము యువజన సర్వీసు, క్రీడాల శాఖ 2025 సంవత్సరమునకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం అందించే అత్యున్నత మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారాలకు సంబంధించి అర్హులైన క్రీడాకారులు ది.28-10-2025 వ తేది రాత్రి 11:59 గంటల లోపుల ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ,జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం. ఎన్. వి.రాజు తెలిపారు.
నంద్యాల జిల్లా నుండి అర్హులైన క్రీడాకారులు ఈ నెల 28వ తేది లోపు www.dbtyas-sports.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని నంద్యాల జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎం. ఎన్. వి.రాజు తెలిపారు
Arattai