పీపీపీ విధానంలో నిర్వహణ.
ప్రధానమంత్రి నేషనల్ డయాలసిస్ ప్రోగ్రాం కింద రాష్ట్రంలోని కిడ్నీ బాధితుల కోసం కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
▪️పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట.
▪️విజయనగరం జిల్లా ఎస్. కోట.
▪️పశ్చిమగోదావరి జిల్లా భీమవరం.
▪️బాపట్ల జిల్లా అద్దంకి.
▪️నంద్యాల జిల్లా సున్నిపెంట.
▪️చిత్తూరు జిల్లా పీలేరు.
▪️శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి వైద్యశాలల్లో ఇవి అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు.పీపీపీ విధానంలో వీటిని నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒక్కో కేంద్రంలో 5 చొప్పున రక్తశుద్ధి యంత్రాలు, ప్రతి కేంద్రానికి అనుబంధంగా ఆర్వో ప్లాంటు ఏర్పాటవుతాయని తెలిపారు.
📖 Also Available as Web Story
Experience this content as an engaging Web Story - perfect for mobile reading!
🎬 View Web Story
Leave a Reply