యూకె: లండన్ లోని పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
విశాఖలో ఈ నెల 14,15 తేదీల్లో నిర్వహిస్తున్న భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాలని పారిశ్రామికవేత్తలకు సీఎం ఆహ్వానం
రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైన నిర్మాణ రంగ సంస్థ ఆరుప్ గ్లోబల్ అఫైర్స్ డైరెక్టర్ జేమ్స్ కెన్నీ, డిజిటల్ రిస్క్ మేనేజ్మెంట్ కంపెనీ అల్తెరిన్ టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫ్రెడీ వూలాండ్

పారిశ్రామిక వేత్తలతో సమావేశానికి హాజరైన పీజీ పేపర్ కంపెనీ సీఈఓ పూనమ్ గుప్తా, WMG యూనివర్సిటీ నుంచి గౌరవ్ మార్వాహా, మాంఛెస్టర్ యూనివర్సిటీ నుంచి నానోసైన్స్ ప్రొఫెసర్ రాధాబోయా హాజరు
రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సుకు హాజరైన ఏఐ పాలసీ ల్యాబ్స్ ఫౌండర్ డైరెక్టర్ ఉదయ్ నాగరాజు, ఫ్లుయెంట్ గ్రిడ్ ప్రెసిడెంట్ రత్న గారపాటి, బ్రిటిష్ హెల్త్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రతినిధి పాల్ బెంటన్ హాజరు
ఏపీలో టెక్నాలజీ రంగంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని పారిశ్రామిక వేత్తలకు వివరించిన ముఖ్యమంత్రి

ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపిన సీఎం
అంతర్గత జల మార్గాల అభివృద్ధి, సరుకు రవాణా అంశాల్లో విస్తృత అవకాశాలు వినియోగించుకోవాలని ఆరుప్ సంస్థను కోరిన సీఎం
ఏపీలో ఏఐ వినియోగం, నిపుణులను తయారు చేసే అంశంతో పాటు ఎకో సిస్టం అభివృద్దికి అవకాశాలు పరిశీలించాలని సీఎం సూచన* అరుదైన భూగర్భ ఖనిజాల వెలికితీతపై వివిధ యూనివర్సిటీలతో భాగస్వామ్యం, అవకాశాలు అందిపుచ్చుకునే ఆస్కారం ఉందని స్పష్టం చేసిన సీఎం
Arattai