నంద్యాల పట్టణంలోని విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో జిల్లా విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం అధ్యక్షులు చంద్ర మౌళీశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
డిసెంబర్ నెలలో ప్రతి ఏటా అమాయక హిందూ సోదరులను మాయమాటలు చెప్పి బలవంతపు మత మార్పిడులు చేస్తున్నారని,ఇది రాజ్యాంగ విరుద్ధమని చంద్ర మౌళీశ్వర రెడ్డి తెలిపారు.
ఇలాంటి చర్యలు దేశ సమైక్యతకు భంగం కలిగిస్తున్నాయని అలాంటి సమూహాలను ఇప్పటికే గ్రామాల్లోని హిందూ సమాజం తరిమికొడుతున్నారని అన్నారు.అలాగే అన్య మతస్థుల విష వలయంలో పడొద్దని హిందూ సమాజానికి వారు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఉపాధ్యక్షులు యర్రం విష్ణు వర్ధన్ రెడ్డి , రాష్ట్ర బజరంగ్ దళ్ కన్వీనర్ పోలేపల్లి సందీప్ , జిల్లా కార్యదర్శి కిషోర్ కుమార్ మరియు జిల్లాలోని అన్ని మండలాలనుండి కార్యకర్తలు పాల్గొన్నారు.
Arattai