భారతదేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పనిచేసే కూలీల సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని గురువారం నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు.
లోక్ సభలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ పోర్టర్ల జీవనోపాధిని కాపాడాలని, దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలలో పోర్టర్ జీవనోపాధి (కూలీలు )అని కూడా పిలుస్తారని, ఈ రైల్వే కూలీలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో పనిచేస్తున్నారని అన్నారు.
బ్యాటరీతో నడిచే వాహనాలు, బస్సు సేవలను కూడా అవుట్ సోర్స్ చేస్తున్నామని దీంతో రైల్వే కూలీల(పోర్టర్) ఆదాయం పడిపోయిందని, కూలీల ఆదాయం కూడా తగ్గడంతో రైల్వే కూలీల కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళాయని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి పార్లమెంట్ దృష్టికి తెచ్చారు. రైల్వే బోర్డు 2008లో ఇలాంటి సంక్షోభాన్ని పరిష్కరించిందని, ఇక్కడ ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందించారని, ఈ పోర్టర్లను రైల్వేలలో ఉంచారు.
కాబట్టి నేను అభ్యర్థిస్తున్నాను. రైల్వే కూలీలకు రక్షణ, క్రమబద్ధీకరణ చేయాలని, ఆధునీకరణ యుగంలో బలహీనమైన శ్రామిక శక్తికి సామాజిక భద్రతను అందించడానికి ఒక సమగ్ర పథకాన్ని ప్రవేశపెట్టాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ ను కోరారు.
Arattai