నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల సేవా మాసోత్సవం లో భాగంగా సంఘం కార్యాలయంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ,అధ్యక్షులు రమణయ్య నిర్వహణలో జరిగిన సేవా కార్యక్రమంలో వైద్యులు రాకేష్ రెడ్డి ,అనిల్ కుమార్ ,భార్గవ వర్ధన్ రెడ్డి,పెసల అశోక్ పాల్గొని దివ్యాంగులకు చక్రాల కుర్చీలు రెండు, ఒక వినికిడి యంత్రం, ముగ్గురికి చంక కర్రలు, బాలికకు మందులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా డాక్టర్ రవి కృష్ణ నిర్వహణలో దివ్యాంగులకు చేస్తున్న సేవా కార్యక్రమాలకు తమ వంతు సహకారం అందజేస్తూ వస్తున్నామని భవిష్యత్తులో కూడా దివ్యాంగులకు సహకారం కొనసాగిస్తామని అన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల ఐఎంఏ ద్వారా ఇప్పటివరకు గత 15 సంవత్సరాల కాలంలో 3000 మంది పైగా దివ్యాంగులకు హెల్త్ కార్డులు అందజేయడం జరిగిందని, వాటి ద్వారా దివ్యాంగులు నంద్యాల ఐఎంఏ వైద్యుల ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత ఓపిడి సేవలు అందుకుంటున్నారని తెలియజేశారు. భారతదేశంలో నంద్యాల ఐ ఎం ఎ శాఖ మాత్రమే ఈ విధమైన నిరంతర సేవా కార్యక్రమం కొనసాగిస్తున్నదని తెలిపారు.

ఈ సందర్భంగా దివ్యాంగులకు సహకరించిన వైద్యులను సంఘం తరఫున శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రామలింగం, కార్యాలయ కార్యదర్శి మధు పాల్గొన్నారు.
Arattai