NANDYAL Jan 06:- భారతీయ వైద్య సంఘం నంద్యాల శాఖ మహిళా వైద్య విభాగం ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ ( గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) ను ప్రాథమిక దశలో గుర్తించడం కోసం ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షా శిబిరాలు మంగళవారం నుండి వారం రోజులపాటు నంద్యాలలో అన్ని స్త్రీ వ్యాధి నిపుణుల ఆసుపత్రులలో నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మంగళవారం సాయి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న జాబిల్లి ఆసుపత్రి లో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో నంద్యాల మహిళా వైద్య విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మాధవి, కార్యదర్శులు డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ లాంచనంగా రిబ్బన్ కత్తిరించి శిబిరాలు ప్రారంభించారు.

డాక్టర్ మాధవి, డాక్టర్ సునీత, డాక్టర్ శైలజ, ఐఎంఏ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి డాక్టర్ లక్ష్మీ సౌజన్య, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యురాలు డాక్టర్ వసుధ మాట్లాడుతూ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తించడానికి అవసరమైన పాప్ స్మియర్ పరీక్షలు,హెచ్.పి.వి. డిఎన్ఏ పరీక్షలు 30 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నిర్వహించడం కోసం ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామని, కొన్ని పరీక్షలు అందరికీ ఉచితంగా, కొన్ని పరీక్షలు స్తోమత ఉన్న వారికి రాయితీతో, పేదలకు ఉచితంగా వారం రోజులపాటు నంద్యాలలో ఉన్న అన్ని స్త్రీ వ్యాధి నిపుణుల ఆసుపత్రులలో చేస్తున్నామని తెలిపారు.

ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ క్యాన్సర్ ప్రాథమిక దశలో గుర్తించడానికి స్క్రీనింగ్ పరీక్షలు చాలా కీలకమని అన్నారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే పూర్తిస్థాయిలో నయం చేయడానికి ఆస్కారం ఉంటుందని, ఎన్టీఆర్ వైద్య సేవలో క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు ఉచితంగా చేస్తారని అన్నారు. మంత్రి ఫరూక్ గతంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మంజూరు చేసిన స్టేట్ క్యాన్సర్ ఆసుపత్రి ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉందని తెలిపారు.నంద్యాల మహిళా వైద్యులు ఏర్పాటు చేసిన ఈ పరీక్షా శిబిరాలలో పరీక్షలు చేయించుకోవల్సిందిగా సూచించారు.
ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ, ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్ ,డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, డాక్టర్ వసుధ, డాక్టర్ హరిత,ఐఎంఏ నంద్యాల పూర్వ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ వినోద్, డాక్టర్ జఫ్రుల్లా, వైద్యులు డాక్టర్ పెసల అశోక్, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్ నీలా ప్రసాద్ ,మహిళా వైద్య విభాగం పూర్వ అధ్యక్షులు డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పన, డాక్టర్ అరుణకుమారి, అకడమిక్ విభాగం అధ్యక్షురాలు డాక్టర్ మల్లీశ్వరి,కార్యదర్శి డాక్టర్ లలిత పాల్గొన్నారు.
Arattai