VIJAYAWADA Feb09:- దేవదాయ ధర్మదాయ శాఖ యొక్క హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ కార్యాలయము, సీతానగరం నందు ఆధ్మాత్మిక సంస్థల ప్రతినిధులు, పూర్వ స్టేట్ కోఆర్డినేటర్లతో సమావేశము చైర్మన్ డా॥ దాసరి శ్రీనివాసులు I.A.S.(R) ఆధ్వర్యంలో నిర్వహింబడింది. సదరు కార్యక్రమమునకు రాష్ట్రంలో గల ధార్మిక ప్రముఖులు అందరూ పాల్గొన్నారు.

హిందూ ధర్మ పరిరక్షణ ద్వారా భవిష్యత్తులో నిర్వహించబోవు ధార్మిక సదస్సులు, ధర్మాచరణ కార్యక్రమములు, సామూహిక అక్షరాభ్యాసముల నిర్వహణ, చిన్న దేవాలయాలలో దీపం కార్యక్రమం, దివ్య దర్శనం స్కీము మొదలైన ధార్మిక కార్యక్రమముల నిర్వహణ కొరకు తగు ప్రణాళిక గురించి కూలంకషంగా చర్చించారు. ముఖ్యంగా ఉద్యోగుల సహకార సంఘాల మాదిరిగా సంస్థ తరపున అర్చక నమోదు కార్యక్రమమును ప్రారంభించాలని సూచించారు. విదేశాలతో సహా ఎక్కడ అర్చకులు అవసరమైన కూడా హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సంస్థ ద్వారా వారి సేవలు ఉపయోగించుకేనే విధంగా ప్రణాళిక రూపకల్పన చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన కోఆర్డినేటర్లకు వారి ప్రాంతాలలో నిర్వహించవలసిన సమావేశములకు సంబంధించిన బాధ్యతలను గురించి చర్చించారు.
రాబోయే రోజులలో ట్రస్ట్ మరియు టిటిడి వారి సమన్వయంతో ఆదరణకు నోచుకోని దేవాలయాలో ధూపదీపనైవేద్యాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో శ్రీ కోటా సునీల్, శ్రీ సందిరెడ్డి కొండలరావు, డాక్టర్ కాసుల కృష్ణంరాజు, శ్రీ పొడుగు వెంకట సత్యనారాయణ ప్రసాదాచార్యులు, శ్రీ తాళ్ళూరి మనవాళ్ళసూరి, శ్రీ బాహాటం శ్రీధర్ కుమార్, శ్రీ తిరువాయపాటి మధుసూదనరావు లు ప్రసంగించారు.
Arattai