NANDYAL Feb17:- త్వరలో ఆంధ్రప్రదేశ్ పారా(దివ్యాంగ) స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరగనున్న రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే నంద్యాల జిల్లా దివ్యాంగుల బ్యాడ్మింటన్ జట్టు ఎంపిక పోటీలు ఆదివారం నంద్యాలలో నిర్వహించబడతాయి. రాష్ట్రస్థాయి పోటీలలో విజేతలుగా నిలిచిన వారు హైదరాబాదులో జరగనున్న ఏడవ జాతీయ పారా బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
నంద్యాల జిల్లా జట్టు ఎంపిక పోటీలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు శనివారం సాయంత్రం లోపు తమ పేర్లను నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ లో ఉన్న నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఇతర వివరాలకు జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎంపీ వి రమణయ్య ఫోన్ నెంబర్ 9849346206 ద్వారా తెలుసుకోవచ్చు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవల్సిందిగా నంద్యాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ రవి కృష్ణ, ఎం.పీ.వి.రమణయ్య, ఉపాధ్యక్షులు బాబా ఫక్రుద్దీన్, కార్యవర్గ సభ్యులు వెంకటరావు దివ్యాంగ క్రీడాకారులను కోరారు.
Arattai