NANDYAL Feb28:- నంద్యాల సంతిరామ్ ఇంజినీరింగ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ “సుస్థిర అభివృద్ధి కోసం శాస్త్రం మరియు సాంకేతికతలో ఆవిష్కరణలు” గా నిర్వహించబడింది. విద్యార్థులు శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమ ప్రతిభను చాటుతూ పలు ఆవిష్కరణాత్మక నమూనాలు, ప్రాజెక్టులను ప్రదర్శించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలు, నమూనా ఎగ్జిబిషన్, పరిశోధనా పత్రాల సమర్పణ కార్యక్రమాల్లో వివిధ విభాగాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్యంగా కృత్రిమ మేధస్సు మరియు యంత్ర అభ్యాసం (ఏఐఎంఎల్), ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజినీరింగ్ (సీఎస్ఈ), డేటా సైన్స్ విభాగాల విద్యార్థులు సుస్థిర అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టులను ప్రదర్శించి న్యాయనిర్ణేతల ప్రశంసలు అందుకున్నారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.వి. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జాతీయ విజ్ఞాన దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు. భారత ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. రామన్ గారి “రమన్ ప్రభావం” ఆవిష్కరణకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని తెలిపారు. విద్యార్థులు పరిశోధన మరియు ఆవిష్కరణల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమానికి కన్వీనర్గా డాక్టర్ బి. శేషయ్య గారు (మౌలిక శాస్త్రాల విభాగాధిపతి) వ్యవహరించగా,ఈవెంట్ సమన్వయకర్తలుగా డాక్టర్ ఎస్. అల్లాహుద్దీన్ గారు (భౌతిక శాస్త్ర విభాగం), డాక్టర్ ఎస్. జీలాని బాషా గారు (రసాయన శాస్త్ర విభాగం) సేవలందించారు.

అదనంగా నిర్వహణ కమిటీలోడాక్టర్ బి. హారిత గారు,ఆర్. రమాదేవి గారు,డాక్టర్ ఎం. రవి శంకర్ రెడ్డి గారు,లిఖిత గారుసహకరించారు.విభాగాధిపతులు మరియు అధ్యాపకులు విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్ర పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమం కళాశాలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే వేదికగా నిలిచి విజయవంతంగా ముగిసింది.

Arattai