NANDYAL :- నంద్యాల పట్టణంలో సోమవారం పొట్టి శ్రీరాములు జయంతిని నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.పొట్టి శ్రీరాములు త్యాగం,తెలుగు ప్రజల కోసం చేసిన పోరాటం,ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి గురించి వారు స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య లయన్స్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు,నిజాముద్దీన్, జనార్ధన్ రామయ్య చంద్రశేఖర్ శ్రీనివాసులు బాబురావు మధు, ప్రసాదు తదితరులు పాల్గొన్నారు
Arattai