NANDYAL June 15:- వేలాది మంది దివ్యాంగులు, వయో వృద్ధుల హర్ష ధ్వనుల మధ్య నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి, జిల్లా కలెక్టర్ జి. రాజకుమారిల చేతుల మీదుగా ఒకేసారి 4 కోట్ల రూపాయల విలువగల, మూడు వేల మందికి పైగా దివ్యాంగులు, వయో వృద్ధులకు ఉచితంగా సహాయ పరికరాలు వారికి అన్నం పెట్టి పంపిణీ చేశారు.

నంద్యాల పట్టణంలోని టేక్కే వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో సోమవారం భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ (ADIP – Assistance to Disabled Persons for Purchase/Fitting of Aids and Appliances) పథకం కింద దివ్యాంగులకు సహాయక పరికరాల పంపిణీ నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, దివ్యాంగుల కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ నారాయణస్వామి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ ఎం డి ఫిరోజ్ ల, ఉమ్మడి కర్నూలు జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాతిమా, నంద్యాల ఆర్ డి ఓ చల్లా. విశ్వనాధ్, నంద్యాల మున్సిపల్ కమిషనర్ బండి. శేషన్న, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి. విశ్వనాధ్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి, వికలాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు డాక్టర్. రవికృష్ణ ల చేతుల మీదుగా దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా వీల్చైర్లు, ట్రైసైకిళ్లు, బ్యాటరీ సైకిళ్ళు, వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్, తదితర సహాయక పరికరాలను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ వికలాంగుల కళ్ళలో ఆనందం చూడాలనే కోరిక ఉందని, కేంద్రంలోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ల సహాయ సహకారం, వారి సలహా సూచనల మేరకు నంద్యాల ప్రజలకు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో హామీ మేరకు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ రెండేళ్లలో రాష్ట్రంలో మొట్టమొదటి సారి నంద్యాల జిల్లాకు ఒకేసారి 4 కోట్ల రూపాయల విలువగల, మూడు వేల మందికి పైగా దివ్యాంగులు, వయో వృద్ధులకు వారి అవసరాలకు అనుగుణంగా వీల్ చైర్లు, ట్రై సైకిళ్ళు, బ్యాటరీ సైకిళ్ళు, మూగ. చెవిటి వారికి వినికిడి యంత్రాలు, వాకింగ్ స్టిక్స్ తదితర సహాయ పరికరాలు అందజేయడం తాను అదృష్టంగా భావిస్తున్నాను అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.

గతంలో కొన్ని ప్రభుత్వాలు వికలాంగులను భారంగా చేస్తే, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం వికలాంగులను భాద్యతగా చూస్తూ వారి అభివృద్ధికి అండగా నిలుస్తుందన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ వికలాంగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేశారని, ఇంటి స్థలాలు, పక్కా గృహాలు ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు దివ్యాంగుల పెన్షన్ రెండు వేల రూపాయల నుంచి ఏకంగా ఆరు వేలు పెంచి ఇంటి వద్దకే ప్రతి నెల ఒకటవ తేదీననే ఇస్తున్నారని, 100 శాతం వికలత్వం కలిగి, ఇతరుల సహాయంతో ఉన్న దివ్యాంగులకు నెలకు రూ. 15 వేల పెన్షన్ అందిస్తూ, ఈ రెండేళ్ల పాలనలో రెండు సార్లు వికలాంగుల బ్యాక్ లాగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం, ఆర్ టి సి బస్సులో ఉచిత ప్రయాణం కల్పించి వికలాంగుల పక్షపతిగా పాలన చేస్తున్నారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు.
వైసీపీ గత పాలనలో జీ ఓ తెచ్చి దివ్యాంగ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ లేకుండా చేశారాని ఆమె విమర్శలు చేశారు. వైసీపీ మెగా డి ఎస్సీ పై అవస్థవ ప్రచారం చేస్తోందని, మహిళలను కించపరిచే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని, వారిపై రాష్ట్రంలోని అన్ని పోలీసు స్టేషన్లలో మహిళలు ఫిర్యాదు చేయబోతున్నామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఎంపీ నిధులతో, జిల్లా కలెక్టర్ సహకారంతో దివ్యాంగుల కమ్యూనిటీ నూతన హల్ నిర్మాణం చేస్తానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హామీ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చిన తనకు వికలాంగులు ఫోన్ చేయాలనీ, మీ సమస్యకు తాను పరిష్కారం చూపుతానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు, టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధసి కురువ ఎల్లాప్ప, నంద్యాల జిల్లా అధ్యక్షులు రమణారెడ్డి, డివిజన్ వికలాంగుల సంఘం అధ్యక్షులు ఎం పి వి రమణయ్య, నాయకులు డి పి మస్తాన్, తదితర వికలాంగుల సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai