NANDYAL July15 :- నంద్యాల పట్టణంలో వెలసిన ప్రపంచంలోనే రెండవ శ్రీ జగజ్జనని దేవాలయంలో బుధవారం ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆళ్లగడ్డకు చెందిన భక్తులు అమ్మవారికి పుట్టింటి పట్టుచీర-సారెను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.ఈనెల 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు అమ్మవారికి పుట్టింటి పట్టుచీర-సారే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు దేవాలయం నిర్వాహకులు పుల్లయ్య తెలిపారు

ప్రపంచంలో రెండవ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఆధ్యాత్మిక పర్యాటకులను ఆకర్షిస్తోంది అని. ఆషాడ మాసం సందర్భంగా దేవాలయంలో వివిధ ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు దేవాలయ నిర్వాహకులు పుల్లయ్య తెలిపారు
Arattai