NANDYAL July19:- ఆదివారం నంద్యాల పట్టణంలోని యోగ చేతన కేంద్రం నందు ఆపద్బాంధవ సేవా సొసైటీ వార్షిక సర్వసభ్య సమావేశం సొసైటీ అధ్యక్షులు గోళ్ళ సుదర్శనం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఏలుకూరి సురేష్, కోశాధికారి శ్రీరామ గణేష్ కుమార్ ఆపద్బాంధవ సేవ సొసైటీ సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆపద్బాంధవ సేవ సొసైటీ సభ్యులు మాట్లాడుతూ 2015లో 18 మందితో సొసైటీ ప్రారంభించామని నేడు 185 మంది సభ్యులతో సేవా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యలో ప్రతిభ ఉండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఆపద్బాంధవ సేవ సొసైటీ ద్వారా నిరంతరం సహకారం అందిస్తూ ఉంటామని తెలిపారు. ఇప్పటివరకు 215 మంది విద్యార్థులకు 82 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందించామని తెలిపారు. సొసైటీ ద్వారా సహకారం పొందిన విద్యార్థులు నేడు ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని తెలిపారు. ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డ విద్యార్థులు ఆపద్బాంధవ సేవ సొసైటీకి సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపారు
Arattai