నంద్యాల పట్టణంలోని మూలమఠం భీమ లింగేశ్వర స్వామి దేవస్థానం ఆవరణలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం కళకళలాడింది.

ఈ సందర్భంగా డాక్టర్ ఉదయ శంకర్ మాట్లాడుతూ, కార్తీక మాసంలో వనభోజనాలు ప్రాచీన కాలం నుంచి వస్తున్న పవిత్ర సంప్రదాయమని, ఈ మాసం శివుడు-కేశవుడి నామస్మరణతో భారతదేశమంతా పులకించిపోతుందని వివరించారు. వనభోజనం ఆధ్యాత్మిక ఉల్లాసం, సామూహిక ఐక్యత, ప్రకృతితో ఐక్యమైన జీవనశైలిని ప్రతిబింబిస్తుందని తెలిపారు.

స్థానిక శాఖ స్వయంసేవకులు, భక్తులు, మహిళలు, పిల్లలు ఈ మహోత్సవంలో పాల్గొని, సాంప్రదాయ వంటకాలతో వనభోజనాన్ని ఆనందంగా ఆస్వాదించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉదయ్ శంకర్ ,గోళ్ల సుదర్శనం, మహేశ్వర్ రెడ్డి,రామ్ ప్రసాద్ వెంకటేశ్వర్లు, ఉమా మహేష్, కృష్ణ ,హేమంత్ శ్రీను గోపాల్ రెడ్డి కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు
Arattai