భారతదేశంలో సామాన్యులకు ఆధునిక వైద్య సేవలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, పార్లమెంట్ హౌస్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిటీ మెంబర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీ, పార్లమెంట్ హౌస్ లో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ కమిటీ ఆధ్వర్యంలో ‘భారతదేశంలో దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి – నివారణ, నిర్ధారణ, చికిత్స, నిర్వహణ’ అనే అంశంపై ముఖ్య సమావేశం జరిగిందన్నారు.

భారతదేశంలో పెరుగుతున్న మూత్రపిండ వ్యాధులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ గురించి, భారతదేశంలో CKD వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, సామాన్య ప్రజలకు అందుబాటు వైద్య సేవలు, ముందస్తు జాగ్రత్తలు, గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన మరింత బలోపేతం కావాలని ఈ సమావేశంలో తీర్మానించామని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.
Arattai