NANDYAL:-పోలియో నిర్మూలనే ధ్యేయంగా ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో స్కౌట్ విద్యార్థుల సేవలు ప్రశంసనీయమని గోస్పాడు ఆం.ప్ర ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ ఖాజాహుస్సేన్ అన్నారు. గోస్పాడు మోడల్ స్కూల్ కు చెందిన స్కౌట్ విద్యార్థులు స్కౌట్ మాష్టర్ డా.నీలం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చురుకుగా పాల్గొని విశేష సేవలు అందించారన్నారు.

గోస్పాడు మండల పరిధిలోని గోస్పాడు, జూలెపల్లె, కానాల, జిల్లెల్ల, నాగులవరం, నెహ్రూనగర్, యాళ్ళూరు, కృష్ణాపురం, గుండుపాపల, కలుగొట్ల, పసురపాడు గ్రామాలలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కేంద్రాలలో స్కౌట్ విద్యార్థులు తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ, చిన్నారులకు పోలియో చుక్కలు వేయించడంలో సహకరించారన్నారు.

ఈ సందర్భంగా స్కౌట్ మాస్టర్ డా. నీలం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా స్కౌట్ విద్యార్థులు ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం అభినందనీయమని, భవిష్యత్తులోనూ సేవాభావంతో ముందుకు సాగాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్కౌట్ విద్యార్థులందరికీ ప్రిన్సిపాల్ , స్కౌట్ అండ్ గైడ్ జిల్లా ఏఎస్ ఒ లియో ఆంటోని, రమేష్ బాబు, ఉపాధ్యాయలు,వైద్యసిబ్బంది అభినందనలు తెలియజేశారు.
Arattai