NANDYAL Feb 01:- నంద్యాలలోని స్పటిక లింగేశ్వర ఆలయంలో ఆదివారం మాఘమాస పౌర్ణమి,యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి ఆరాధన వేడుకలను యోగనంద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.యోగా గురువు అచల పరిపూర్ణ యోగానంద పాములేటి స్వామి వారికి పంచామృత అభిషేకం, తదనంతరం లోకకళ్యాణార్థం ప్రత్యేక హోమాలు నిర్వహించారు.

ఆధ్యాత్మిక గురువు ప్రసాద్ గురూజీ,యోగా గురువు దామోదర్ రెడ్డి లు పూర్ణాహుతి లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు ప్రసాద్ గురూజీ యోగా గురువు దామోదర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ యోగా పాములేటి స్వామి నంద్యాల పట్టణానికి మొట్టమొదటిసారిగా యోగా ను పరిచయం చేసిన వ్యక్తి అని తెలిపారు.

ఎంతోమందికి యోగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలని తెలిపారు.దాదాపు 30 సంవత్సరాలుగా ప్రతి నెల పౌర్ణమి రోజున లోక కళ్యాణార్థం హోమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు.అనంతరం ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మయ్య అనిల్ శ్రీనివాసరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి రఘునాథరెడ్డి యోగ సభ్యులు పాల్గొన్నారు

Arattai