AMARAVATHI Feb10 :- • నేడు సచివాలయంలోని ఆర్ & బీ శాఖా కార్యాలయంలో ఏపీ డ్రోన్ కార్పొరేషన్ పురోగతిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష సమావేశం
• డ్రోన్ కార్పొరేషన్ లో జరుగుతున్న అభివృద్ధిపై ఆరా తీసిన మంత్రి
• ఆంధ్రప్రదేశ్ ను డ్రోన్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా తీర్చిదిద్దాలన్న సీఎం చంద్రబాబు ఆశయం మేరకు పనిచేయాలన్న మంత్రి
• డ్రోన్ సిటీ ఏర్పాటు, టెస్టింగ్ కు ప్రత్యేక ఎయిర్ స్పేస్ కొరకు కేంద్ర ప్రభుత్వ సంస్థ DGCA అనుమతిపై చర్చ

• ఇప్పటికీ డ్రోన్ కార్పొరేషన్ ఏపీ ఫైబర్ నెట్ లో భాగంగా ఉన్నందున స్వయం ప్రతిపత్తి కల్పించాలనే అంశంపై చర్చ
• క్షేత్రస్థాయిలో వ్యవసాయం అనుబంధ రంగాల్లో డ్రోన్ల వినియోగం, ప్రజల్లో అవగాహనపై ఆరా తీసిన మంత్రి
• డ్రోన్లు వినియోగానికి భారీగా డిమాండ్ ఉన్నప్పటికీ, ఫైలెట్ల కొరత అంశంపై చర్చ
• ఈ వేసవిలో ప్రతి జిల్లా కేంద్రంలో డ్రోన్ ల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలి
• వచ్చే ఖరీఫ్ సీజన్ కు ఫైలెట్ సన్నద్ధం అయ్యేలా ప్రణాళికలు రచించుకోవాలని మంత్రి సూచన

• ఐఐటీ, పాలిటెక్నిక్ వంటి కళాశాలల్లో శిక్షణ ఇచ్చేందుకు సాంకేతిక నైపుణ్యతను ఉపయోగించుకోవాలని సూచన
• భవిష్యత్తులో ఫైలెట్ శిక్షణకు ఉన్న డిమాండ్, ఆవశ్యకత ఆధారంగా వృత్తి నైపుణ్య కోర్సులు రూపొందించే అంశాలపై పరిశీలించాలని మంత్రి ఆదేశం
• సీఎం గారి ఆలోచనల మేరకు డ్వాక్రా సంఘాల మహిళలకు డ్రోన్ పైలెట్లు గా శిక్షణ అందించే అంశంను పరిశీలించాలని సూచించిన మంత్రి
• ఈ సమీక్ష సమావేశంలో పాల్గొనున్న ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండి శౌర్య మాన్ పటేల్, ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ అడిషనల్ సీఈవో పి. ప్రవీణ్ కుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులు

Arattai