రాష్ట్ర విద్యుత్ శాఖ, జిల్లా ఇన్ చార్జీ మంత్రి గొట్టిపాటి రవికుమార్:అమరావతి, పోలవరం పూర్తి కావాలని స్వామి వారిని కోరుకున్నాం.రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలని వేడుకున్నాం. అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

రాష్ట్ర హోం మంత్రి అనిత:రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి ప్రశాంతంగా జరుగుతుంది.వచ్చిన భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకుంటున్నారు.క్యూ లైన్లలో అన్ని ఏర్పాట్లు చేశాం.

చీఫ్ విప్ ఆంజినేయులు: ఆన్ లైన్ టికెట్స్ కొని దర్శనం చేసుకున్నాను.టైం స్లాట్ ప్రకారం దర్శనాలు జరుగుతున్నాయి.ప్రవేటు వాహనాలు పైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

ఎమ్మెల్యే అరవింద్ బాబు:
ఇప్పటికే నలభై నుండి ఎనభై వేల మంది దర్శనం చేసుకున్నారు.
క్యూ లైన్లలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ అందిస్తున్నాం.
స్వామి వారికి పట్టు వస్త్రాలు అందించటానికి మంత్రులు వచ్చారు.
Arattai