NANDYAL Feb22:- తెలుగు భాషా సాహిత్యాలు విశిష్టమైనవని, ఆధునికత మోజులో తెలుగు భాషకు దూరం కావాల్సిన అవసరం లేదని, తెలుగు భాషను మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయని, మాతృభాషను కాపాడుకుంటే జాతి భవిష్యత్తు ఉంటుంద ని సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్ అన్నారు. ఆదివారం నంద్యాల పట్టణంలో మిడ్ టౌన్ రోటరీ క్లబ్ అధ్యక్షులు కేశవమూర్తి, కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అతిధులు తెలుగు తల్లి చిత్రపటానికి మాలార్పణ చేశారు

ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన మోహన్ మాట్లాడుతూ తెలుగు ప్రాచీనమైనదని తెలపడానికి కర్నూలు జిల్లాలో అనేక శాసనాలు లభ్యమయ్యాయని భాష నాగరికత ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే వెల్లివిరిసిందని అన్నారు. వేల సంవత్సరాల తెలుగు భాష చరిత్రలో ఉమ్మడి కర్నూలు జిల్లా ది అనిర్వచనీయ స్థానమని అన్నారు.. క్లబ్ సభ్యులు మోహన్ ను ఘనంగా సత్కరించారు.. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ గజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షులు కే.వి కృష్ణయ్య రోటరీ మాజీ గవర్నర్ చిన్నపురెడ్డి మిడ్ టౌన్ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు డివి సుబ్బయ్య, చింతల మోహన్ రావు, రమేష్ సాహితీ స్రవంతి నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, నీలం వెంకటేశ్వర్లు, అన్నెం శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Arattai