NANDYAL :- ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ కార్యదర్శి డాక్టర్ మహమ్మద్ రఫీ రంజాన్ మాసం పురస్కరించుకుని ఫిబ్రవరి నెల 18వ తేదీ నుండి ఈనెల 20 వ తేదీ వరకు నెల రోజులు పైగా పద్మావతి నగర్ మెయిన్ రోడ్డు లో ఉన్న జి.ఎస్.ఆర్. ఆస్పత్రిలో ఎముకలు కీళ్ల ,ఓపిడి సేవలు ఉచితంగా అందించారు.
ఈ సందర్భంగా నంద్యాల ఐఎంఏ ఆధ్వర్యంలో శుక్రవారం జి.ఎస్.ఆర్. ఆస్పత్రిలో జరిగిన అభినందన కార్యక్రమంలో జాతీయ ఐఎంఏ కేంద్ర కమిటీ సభ్యులు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావులు డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ అరిఫా బాను దంపతులను శాలువా జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ గత నెల రోజులలో రెండు వేల మందిపైగా రోగులకు ఉచిత ఎముకలు, కీళ్ల ఓపిడి చికిత్సలు అందించడం జరిగిందన్నారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేశామని, 40 మందికి ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించామని తెలిపారు. చాలామంది పేదలు భవిష్యత్తులో తరచూ చూపించుకోవలసిన అవసరం ఉన్నవారు ఉండడంతో, ఇకపై ప్రతి గురువారం జి ఎస్ ఆర్ ఆస్పత్రిలో ఎముకలు ,కీళ్ల ఓపిడి చికిత్సలు ఉచితంగా అందరికీ అందిస్తామని ప్రకటించారు. ఇది నిరంతరం కొనసాగిస్తామని అన్నారు.

డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ డాక్టర్ మహమ్మద్ రఫీ నెల రోజులపాటు ఉచితంగా ఓపిడి చికిత్సలు అందించడం ప్రశంసనీయమన్నారు. ప్రతి గురువారం నిరంతరంగా ఉచిత ఎముకలు, కీళ్ల ఓపిడి చికిత్సలు అందజేయడానికి ముందుకు రావడం స్ఫూర్తిదాయకమన్నారు.
ఈ కార్యక్రమంలో జి ఎస్ ఆర్ ఆసుపత్రి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఆరీఫా బాను,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, ఐఎంఏ నంద్యాల మాజీ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావులు పాల్గొన్నారు.
Arattai