NANDYAL April 02:- బనగానపల్లి మండలం భానుముక్కల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ దేవాలయానికి చెందిన దాదాపు 35 ఎకరాల మాన్యమును ప్రజలకు పంచిపెట్టే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా గౌరవనీయ మంత్రివర్యులు BC జనార్దన్ రెడ్డి గారి యొక్క మాటలు స్పష్టం చేస్తున్నాయి, ఈ భూముల పంపిణీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి.
ఈ సందర్భంగా నంద్యాల జిల్లా విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్రం విష్ణువర్ధన్ గారు మాట్లాడుతూ…..
పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇవ్వటం విశ్వ హిందూ పరిషత్ స్వాగతిస్తుంది. అయితే అవి దేవాలయ మాన్యాలు ఇస్తే కచ్చితంగా ఖండిస్తుంది.అవసరమైతే ప్రజా పోరాటం,న్యాయపోరాటం చేయడానికి సిద్ధం అని తెలిపారు. ఈ దేవాలయ భూముల పంపిణీ విషయంలో విశ్వ హిందూ పరిషత్ అభ్యంతరాలను కలెక్టర్ గారికి, ఎండోమెంట్ డీఈవో గారికి వినతిపత్రంతో తెలియజేస్తామని తెలిపారు.

విశ్వ హిందూ పరిషత్ నంద్యాల జిల్లా అధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఈ విధంగా దేవాలయ మాన్యాలను పంచుకుంటూ, ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చుకుంటూ వెళితే ఏదో ఒక రోజున దేవాలయ వ్యవస్థ కుంటుపడటం తప్పదు.దేవాలయ వ్యవస్థ యధాతరంగా ఉండాలంటే ఆ యొక్క మాన్యముల పరిరక్షణ పకడ్బందీగా ఉండాలి. అంతేగాని ప్రభుత్వ అవసరాలకు దేవుడి విలువైన మాన్యాలను ఇవ్వడం సరైనది కాదని తెలిపారు.దేవాలయ భూములను రక్షించాల్సిన ప్రభుత్వాలే ఈ విధంగా దేవాలయ భూములను ఇవ్వడం సరైనది కాదన్నారు.
నంద్యాల జిల్లా విశేష సంపర్క ప్రముఖ కాల్వ శేష సాయి గారు మాట్లాడుతూ గతంలో దేవాలయ భూములను ఈ విధంగా అన్యాక్రాంతం చేయాలని చూస్తే ఇది తప్పు అని కోర్టు తీర్పులు కూడా వచ్చాయి అన్నారు.ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి గారు పాల్గొన్నారు.
Arattai