NANDYAL June 05 :- శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల (అటానమస్), నంద్యాలలో 2025 మరియు 2026 సంవత్సరాలలో డిగ్రీ మరియు పీజీ పూర్తి చేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో మీడెన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ను 09 జూన్ 2026న ఉదయం 9.00 గంటల నుంచి శ్రీనివాసనగర్ క్యాంపస్ నందు నిర్వహిస్తున్నట్లు కళాశాల యాజమాన్యం వెల్లడించింది.ఈ డ్రైవ్లో IT Recruiter పోస్టులకు నియామకాలు చేపట్టనున్నారని, ఎంపికైన అభ్యర్థులకు బెంగళూరులోని కోరమంగలలో ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో ప్రత్యక్ష ఇంటర్వ్యూ మరియు HR రౌండ్ నిర్వహించబడతాయని, ఎంపికైన వారికి సంవత్సరానికి ₹3.0 లక్షల వేతన ప్యాకేజ్ (వేరియబుల్ పే సహా) అందజేయబడుతుందని పేర్కొన్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు తప్పనిసరిగా ముందస్తు నమోదు (Pre-Registration) చేసుకోవాలని, కళాశాల విడుదల చేసిన (_*https://forms.gle/XzUxuRQkTSkwVGmg9*_) ఈ గూగుల్ ఫారమ్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కళాశాల ఛైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కళాశాల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రిన్సిపాల్ కె.బి.వి. సుబ్బయ్య మాట్లాడుతూ విద్యార్థులు ఇలాంటి క్యాంపస్ డ్రైవ్లలో చురుకుగా పాల్గొని తమ కెరీర్ను నిర్మించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో డైరెక్టర్ డాక్టర్ జి. హేమంత్ రెడ్డి, డీన్ ఆఫ్ అకాడెమిక్స్ ఎ.ఎస్. ప్రగతి రెడ్డి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్లు డాక్టర్ యు.వి.ఎస్. కుమార్ మరియు సంపత్ కుమార్ పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్, నంది న్యూస్ రిపోర్టర్
Arattai