NANDYAL June16 :- బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలేనికి చెందిన 13 ఏళ్ల బాలుడు, ఉప్పాల అమర్నాథ్ గౌడ్ దారుణ హత్యకు గురై నేటితో మూడేళ్లు పూర్తయిన సందర్భంగా, నంద్యాల తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నంద్యాల పార్టీ కార్యాలయం నుంచి పద్మావతి నగర్ ఆర్చి వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ ఏర్పాటుచేసిన అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ … తన సోదరిని వేధించిన వైసీపీ నాయకులను ధైర్యంగా ఎదిరించి, ప్రాణాలర్పించిన అమర్నాథ్ గౌడ్ త్యాగం స్ఫూర్తిదాయకమని అన్నారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలపై ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉన్నారని, అప్పట్లో జరిగిన ప్రజా తీర్పు ద్వారా వైసీపీకి 11 సీట్లు ఇచ్చి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు . ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి సాదిస్తోందని, ప్రజల మద్దతు ఎప్పుడూ అభివృద్ధి చేసే కూటమి ప్రభుత్వానికే ఉంటుందని తెలిపారు . అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, బాలుడి త్యాగాన్ని ఎప్పటికీ మరువబోమని అన్నారు .
ఈ నిరసన కార్యక్రమంలో జిల్లెల్ల శ్రీరాములు, రమణయ్య గౌడ్, గోవిందు నాయుడు, ఉప్పర సురేష్ కుమార్, రామచంద్రుడు, బుగ్గ రాముడు , మరాఠీ సూరి, పద్మ, నాగరత్నమ్మ, మధు సాయి, మంజుల సుబ్బరాయుడు, వడ్డే జనార్ధన్, మారుతి కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక నాయకులు పాల్గొన్నారు .రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai