ఐఎంఏ నంద్యాల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.సి.రాయ్ జన్మదినోత్సవం సందర్భంగా స్థానిక జయంతా ఫంక్షన్ హాల్ సమావేశ మందిరంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు.నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు అధ్యక్షతన, కార్యదర్శి డాక్టర్ పనిల్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ముఖ్యఅతిథిగా,గౌరవ అతిథులుగా ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ బాలరాజు,రాష్ట్ర ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అధ్యక్షులు ఏవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.కలెక్టర్ రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. డాక్టర్ బి. సి.రాయ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఐఎంఏ వైద్యుల దినోత్సవ పురస్కారాలను ప్రముఖ కవి, రచయిత ప్రొద్దుటూరు కు చెందిన డాక్టర్ డాక్టర్ కోడూరు ప్రభాకర్ రెడ్డి, నంద్యాల వైద్యులు డాక్టర్ మురళి ధర్ రావు, డాక్టర్, డాక్టర్ శరత్ చంద్ర రెడ్డి, డాక్టర్ శేష ఫణి,డాక్టర్ జ్యోతి వాణి, డాక్టర్ ఆశాలత,డాక్టర్ సరిత, సామాజిక సేవలకు జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.పి.వి. రమణయ్య, చిత్తలూరి రామ చంద్రయ్య లకు కలెక్టర్ రాజకుమారి అందజేసి అభినందించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ . వైద్యులు రోగి ప్రాణాలు కాపాడడానికి తమ శాయ శక్తుల ప్రయత్నం చేస్తారని, వైద్యో నారాయణో హరి గా భారత సంస్కృతిలో చెప్పారన్నారు. కోవిడ్ సమయంలో వైద్యులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి చేసిన సేవలు సమాజం ఎన్నటికి మరువదన్నారు. వైద్యులు మానవతా దృక్పథంతో సేవలందించాలని పిలుపునిచ్చారు.నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు

డాక్టర్ బాల రాజు,డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఐఎంఏ దేశంలో 1928లో ప్రారంభించబడిందని ఇప్పుడు 35 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో 1750 బ్రాంచీలలో నాలుగు లక్షల మంది సభ్యులతో ప్రపంచంలో అతిపెద్ద వృత్తి స్వచ్ఛంద సంస్థ ఐఎంఏ అని అన్నారు.దేశంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి కృషి చేస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 బ్రాంచ్ లలో ఇరవై రెండు వేల మంది ఐఎంఏ సభ్యులు అటు ప్రభుత్వ రంగంలో, ప్రైవేటు రంగంలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని ,వీరి రక్షణ చట్టాన్ని రాష్ట్రంలో మరింత కఠిన తరం చేయాల్సిన అవసరం ఉందని అదేవిధంగా జాతీయస్థాయిలో కూడా వైద్య రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు.కలెక్టర్ రాజకుమారిని నంద్యాల వైద్యులు ఘనంగా సత్కరించి అభినందించారు

జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులకు, వైద్యుల కుటుంబ సభ్యులకు నిర్వహించిన వివిధ క్రీడా పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఐఎంఏ నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, ఐఎంఏ రాష్ట్ర ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ బాలరాజు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి,ఐఎంఏ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన రెడ్డి, డాక్టర్ అనిల్ ,నంద్యాల శాఖ మహిళా విభాగ నాయకులు డాక్టర్ నర్మద ,డాక్టర్ నాగమణి, డాక్టర్ లక్ష్మీ సౌజన్య, డాక్టర్ కల్పన, డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ శైలజ, డాక్టర్ సునీత, డాక్టర్ లలిత అధిక సంఖ్యలో వైద్యులు కుటుంబ సభ్యులతో పాల్గొన్నారు.

వైద్యుల దినోత్సవ నిర్వహణకు డాక్టర్ హరినాధ రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసన్న, డాక్టర్ సంజీవ్ కుమార్, డాక్టర్ సరిత, డాక్టర్ రామ సుబ్బారెడ్డి, డాక్టర్ రూపేంద్ర నాథ్ రెడ్డి సహకారం అందించారు.
Arattai