రాజధాని అమరావతిలో సీఆర్డీయే కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ప్రతి ఫ్లోర్లోకి వెళ్లి పరిశీలించారు.

అనంతరం సీఆర్డీయే కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ , మంత్రి నారాయణ , స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, పొన్నూరు ఎమ్మెల్యేలు ధూలిపాళ్ల నరేంద్ర గారు, కొలికపూడి శ్రీనివాసరావు గారు, వివిధ కార్పొరేషన్ ఛైర్మన్లు, అధికారులు పాల్గొన్నారు

సీఆర్డీయే కార్యాలయం ప్రారంభం అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగం
.• రాజధాని రైతులకు ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చూస్తాం.
• రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం.
• రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి

నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తీసుకోవాలి.
• రైతులతో నిరంతరం మాట్లాడుతూ.. వారి సమస్యలకు పరిష్కారం చూపే బాధ్యతను ఈ ముగ్గురు తీసుకుంటారు.

• అప్పటికీ ఇంకా పరిష్కారం కాని సమస్యలేమైనా ఉంటే నేను బాధ్యత తీసుకుంటాను.
• త్వరలోనే భూములిచ్చిన రైతులతో సమావేశమవుతా.
Leave a Reply