NANDYAL Dec26:- అహోబిలం పారువేట ఉత్సవాలకు యూనెస్కో గుర్తింపుకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ద్వారా కేంద్ర ప్రభుత్వంచే కృషి చేస్తున్నామని, అహోబిలేసుడి ఆశీర్వాధం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉండాలని స్వామి వారిని ప్రార్థించానని,అహోబిలం శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పారువేట ఉత్సవ శోభా యాత్రలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.శుక్రవారం నంద్యాల పట్టణంలో మన ఊరు – మన గుడి, మన భాద్యత కార్యక్రమంలో భాగంగా అహోబిల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి పారువేట ఉత్సవ శోభా యాత్ర భక్తి శ్రద్దలతో జరిగింది.

నంద్యాల మున్సిపల్ టౌన్ హల్ లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ముఖ్య అతిథిగా పాల్గొని అహోబిల పారువేట ఉత్సవ పల్లకిలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వార్లను దర్శనం చేసుకున్నారు.ఈ సందర్బంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అపురూప ఉత్సవం అహోబిలం అన్నారు. అహోబిలేసుడు తన కళ్యాణంకు రారాండని 33 గ్రామాల్లో, 45 రోజులు తిరిగి భక్తులను ఆహ్వానించిడం ప్రపంచ చరిత్రలో అరుదైన ఘటనగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అభివర్ణించారు.

కాకతీయుల కాలం నుంచి 1000 ఏళ్లుగా ఈ సాంప్రదాయం కొనసాగించడం అభినందనీయం అన్నారు. స్వామి అమ్మవార్లే గ్రామాలకు వచ్చి తమ కళ్యాణంకు భక్తులను ఆహ్వానించిడం నంద్యాల జిల్లా భక్తులు చేసుకున్న పుణ్యం అన్నారు. 33 గ్రామాల్లో 45 రోజులు అహోబిల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వార్ల పారువేట ఉత్సవంలో సేవ చేసే గుడి కట్టు, ఆయాకట్ల సేవలు గొప్పవన్నారు. స్వామి వార్లకు సేవ చేస్తున్న చెంచులు, పల్లకి మోసే బోయలు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, సాకాలి, మేదరి తదితర ఆయ కట్లను ఈ సందర్బంగా సన్మానం చేయడం మంచి సాంప్రదాయం అన్నారు.
ఆ అహోబిలం స్వామి వార్ల ఆశీస్సులతో యూనిస్కో గుర్తింపుకు కృషి చేస్తున్నానని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఈ కార్యక్రమంలో అహోబిల దేవస్థానం ప్రధాన అర్చకులు వేణుగోపాలాచార్యలు, ఆలయ ముఖ్య సలహాదారులు శేతు రామస్వామి, అర్చకులు మధుసూదనా చార్యులు, మన ఊరు, మన గుడి జిల్లా పర్యవేక్షకులు శివ కుమార్ రెడ్డి, సీనియర్ న్యాయవాది, మార్క్ ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ తాతిరెడ్డి తులసి రెడ్డి, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
Arattai