జిల్లాలో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ఉపాధ్యాయ సంఘాలు బాధ్యతాయుతంగా మార్గదర్శకత్వ ధోరణితో వ్యవహరించాలని నంద్యాల జిల్లా విద్యాశాఖాధికారి జనార్దన్ రెడ్డి సూచించారు.
నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ నూతన సంవత్సర డైరీ ని, క్యాలెండర్ ను జనార్దన్ రెడ్డి శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విధానాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ఉపాధ్యాయ సంఘాలు కృషి చేయాలన్నారు.
ఆర్జేయుపి రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్తోజు వీరబ్రహ్మం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షరీఫ్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల హక్కులు, సంక్షేమం, విద్యారంగంలో నైతిక విలువల పరిరక్షణకు తమ సంఘం కృషి చేస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ప్రసాద్, సంఘ ప్రతినిధులు అన్నెం శ్రీనివాస రెడ్డి, శేషఫణి, నీలం వెంకటేశ్వర్లు అపస్ జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి, హుస్సేన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Arattai