NANDYAL JAN18:- నంద్యాల పట్టణంలోని విశ్వహిందూ పరిషత్ జిల్లా కార్యాలయం నందు VHP ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరంనకు విజయదంత వైద్యశాల వారు తమ సేవలను అందించారు. శిబిరానికి రాజారెడ్డి, మరియు జిల్లెల్ల శ్రీరాములు అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విషయం సభ్యులు మాట్లాడుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిత్యం సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటామని తెలిపారు. భవిష్యత్తులో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. కంప్యూటర్ DTP కోర్సులను ఉచితంగా నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమములో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షులు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, మరియు జిల్లా అధ్యక్షులు బుగ్గన చంద్రమౌళీశ్వర రెడ్డి మరియు విశేష సంపర్క ప్రముఖు కాల్వ శేష సాయి మరియు గోర్ల సుదర్శనం మరియు పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ మరియు పట్టణ అధ్యక్షురాలు సుహాసిని మరియు విశ్వహిందూ పరిషత్ జిల్లా నైతిక శిక్షణ ప్రముఖ్ యన్ సి హెచ్ వెంకటసుబ్బయ్య మరియు కార్యకర్తలు ఆకుల శ్రీనివాస్ మరియు మురళీధర్ రెడ్డి మరియు కాళ్ల మహేష్ పాల్గొన్నారు.
Arattai