NANDYAL June22 :- నంద్యాల పద్మావతి నగర్ లోని ఇంద్రప్రస్థ హోటల్ నందు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నంద్యాల ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో క్రెడిట్ రిచ్ ప్రోగ్రాం ద్వారా రుణ విస్తరణ కార్యక్రమము మరియు ఖాతాదారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు

సమావేశం నందు ఖాతాదారులచే సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నంద్యాల రీజినల్ ఆఫీస్ ఆధ్వర్యంలో మంజూరు అయిన రుణాలను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది.27.25 కోట్ల విలువగల రుణాలు అందజేశారు ఇందులో పొదుపు గ్రూపులకు 23 కోట్లు, హౌసింగ్, వెహికల్ మరియు మైక్రో ఇండస్ట్రియల్ లకు 4 కోట్ల 25 లక్షల రుణాలు మంజూరు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మా బ్యాంకు ద్వారా గృహ, వాహన, వ్యక్తిగత, విద్య మరియు ఆస్తి తనఖా రుణాలు అతి తక్కువ వడ్డీతో త్వరీతగతిన రుణాలు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు మా బ్యాంకు పూర్తిగా ప్రభుత్వ బ్యాంకు అని ఈ బ్యాంకు డిపాజిట్లపై అన్ని ప్రభుత్వ బ్యాంకుల కంటే అధిక వడ్డీ ఇస్తుందని మరియు అత్యధిక భద్రత కలదని తెలియజేశారు.

ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఖాతాదారులు మరియు ప్రతి ఒక్క వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సుధాకర్ సీనియర్ మేనేజర్ లు కిరణ్, అమిత్ కుమార్, శేష సాయి కిరణ్, నాగేంద్ర మరియు క్రెడిట్ ప్రాసెసింగ్ సెల్ సీనియర్ మేనేజర్ రమణయ్య, చంద్రశేఖర రావు బ్రాంచ్ మేనేజర్లు రీజినల్ ఆఫీస్ సిబ్బంది మరియు ఖాతాదారులు పాల్గొన్నారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai