నంద్యాల పట్టణంలో కార్తీక మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని శ్రీ కేదారేశ్వరి సమేత శ్రీ ప్రథమ నందిశ్వరు స్వామి దేవస్థానం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎండి. ఫరూక్ హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు.

కార్తీక మాసం శివారాధనకు అత్యంత పవిత్రమైన మాసం కావడంతో, ఉదయం నుండే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మంత్రి ఎన్ఎండి ఫరూక్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక మాసంలో భక్తులు నియమ నిష్టలతో శివుడిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని ఆకాంక్షించారు.

మంత్రి ఎన్ఎండి ఫరూక్ చేతుల మీదుగా అభివృద్ధి పనుల ప్రారంభం:
ఆలయ అభివృద్ధి మరియు భక్తుల సౌకర్యార్థం చేపట్టిన పలు కార్యక్రమాలను ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు.

అన్నప్రసాద వితరణ కేంద్రం ప్రారంభం :
కార్తీక మాసం నెల రోజుల పాటు నిరాటంకంగా నిర్వహించే అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని మంత్రి ఎన్ఎండి ఫరూక్ లాంఛనంగా ప్రారంభించారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 12:30 నుండి 2:00 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదం అందించనున్నట్టు ఆలయ కమిటీ తెలియజేసింది.

వాటర్ ట్యాంక్ మరియు తాగునీటి సౌకర్యం :
భక్తుల తాగునీటి అవసరాల కోసం నిర్మించిన నూతన వాటర్ ట్యాంక్ మరియు తాగునీటి సరఫరా వ్యవస్థను ఆయన ప్రారంభించారు.

వసతి గృహాల ప్రారంభం :
దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఆలయ ప్రాంగణంలో బస చేయడానికి వీలుగా నిర్మించనున్న 5 వసతి గృహాలను మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు
ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ మత సామరస్యాన్ని, భక్తి భావాన్ని పెంపొందించడంలో దేవస్థానాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కొనియాడారు. ఆలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా వసతి గృహాల నిర్మాణానికి, నిరంతర అన్నదాన కార్యక్రమానికి భక్తులు మరియు దాతలు ముందుకు వచ్చి తమవంతు సహకారం అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, చలం బాబు , పూజారి ప్రవీణ్, అన్నదాన సమితిసభ్యులు కృష్ణారెడ్డి, యుగంధర్ రెడ్డి, నాగరాజు, శివారెడ్డి, రామకృష్ణారెడ్డి, రామశివాడ్డి , శ్రీనివాస్ రెడ్డి, శైలు, ఆచారి, మద్దిలేటి, నాగరాజు, రమణ, నర్సింహులు, సుధాకర్, లక్ష్మీనారాయణ రెడ్డి, నంద్యాల మండల టిడిపి కన్వీనర్ మునగాల విశ్వనాథరెడ్డి, కొమ్ము హరి, చింతకుంట్ల విశ్వం మరియు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మరియు పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Arattai