ప్రతి సంవత్సరం డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా నిర్వహించే సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనికుల సంక్షేమ నిధికి జిల్లా ప్రజలు ఉదారంగా చేయూత అందించాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విజ్ఞప్తి చేశారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో ఫ్లాగ్ డే పోస్టర్లను కలెక్టర్, జాయింట్ కలెక్టర్, సైనిక సంక్షేమ అధికారి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో శత్రువులను ఎదుర్కొంటూ, అంతర్గత విపత్తుల సమయంలో ప్రజలను రక్షిస్తూ సాయుధ దళాలు దేశం కోసం అపారమైన త్యాగాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. వారి సేవలు, త్యాగాలను స్మరించుకునేందుకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఫ్లాగ్ డే నిధి సేకరణ చేపడతామని తెలిపారు.
వరదలు, భూకంపాలు వంటి విపత్తుల్లో ప్రజలను రక్షించడం నుండి ఉగ్రవాద కార్యకలాపాలను అణచివేయడం వరకు భారత సైన్యం కీలక పాత్ర పోషిస్తోందని ఆమె గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ప్రతి పౌరుడు తన వంతు సహాయం అందించాలని సూచించారు.
Arattai