NANDYAL JAN 10:- ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంపొందించేలా కృషి చేయాలని అలాగే ఉపాధ్యాయ సంఘాలు విద్యాప్రమాణాలను పెంపొందించటానికి పాటు పడాలని రాష్ట్ర మైనార్టీ,న్యాయశాఖామాత్యులు ఎన్ ఎమ్ డి ఫరూక్ కోరారు. రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ క్యాలెండర్లను మంత్రి ఫరూక్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ సంఘాలు మార్గదర్శక ధోరణితో విద్యాభివృద్ధికి కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో భాషోపాధ్యాయ సంస్థ నంద్యాల జిల్లా అధ్యక్షులు కన్నయ్య, కార్యదర్శి వుశేన్ మియ్యా, సంఘనాయకులు వెంకటరాముడు, నబీసా, దామోధర్ ,నరేంద్ర,రఫీ, హబీబుల్లా, అన్నెం శ్రీనివాసరెడ్డి, శేషఫణి, డా.నీలం వెంకటేశ్వర్లు,మాబుబాష తదితరులు పాల్గొన్నారు.
Arattai