NANDYAL:సంక్రాంతి సందర్భంగా బ్రాహ్మణ సేవా సమాఖ్య నంద్యాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది శ్రీ గాయత్రీ దేవి ఆలయప్రాంగణంలో సోమవారం మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు అందజేశారు.

పోటీలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహక బహుమతులు అందజేసినట్లు సమాఖ్య అధ్యక్షులు కేశవ మూర్తి పేర్కొన్నారు. న్యాయ నిర్ణేతలను సన్మానించడం జరిగింది. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.
Arattai