నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండు ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం
NANDYAL June12 :- నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు రెండు ఏళ్లు పేరుతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రభుత్వ హామీల అమలుపై ప్రశ్నిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి శ్రీనివాస నగర్ వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు.

ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపిస్తూ, ఆ హామీలకు సంబంధించిన ప్లకార్డులను గాడిదలపై ఉంచి వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని వైసీపీ నాయకులు విమర్శించారు. ప్రజలను మోసం చేసిన పాలనకు వ్యతిరేకంగానే ఈ నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ర్యాలీలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు.
రాజేంద్రకుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai