ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో ఘనంగా వికసిత్ భారత్ యువ కనెక్ట్ మరియు ఖేలో ఇండియా సంవాద్
NANDYAL Aug27:- నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాల యందు జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొని జాతీయస్థాయిలో మన ప్రియతమ ప్రధాని గారి అధ్యక్షతన నిర్వహించినటువంటి “వికసిత్ భారత్ యువ కనెక్ట్ & ఖేలో ఇండియా యువ సంవాద్” కార్యక్రమం ఆన్లైన్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో నంద్యాల నుండి జాతీయస్థాయిలో పాల్గొన్నటువంటి క్రీడాకారులను ఆహ్వానించి వారికి ఘనంగా సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమం నందు మన ప్రియతమ ప్రధాని గారు ప్రసంగిస్తూ నేడు భారతదేశం క్రీడల యందు సాధించినటువంటి ప్రగతిని ఈ సందర్భంగా దేశ ప్రజల ముందు ఉంచారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ గారు డాక్టర్ ఎన్ శశికళ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాకీ క్రీడాకారిణి వై భార్గవి, పి ఎస్ సి అండ్ కె వి ఎస్ సి ప్రభుత్వ జూనియర్ కళాశాల లో ద్వితీయ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈ అమ్మాయి జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ నుంచి పాల్గొని ద్వితీయ స్థానంలో నిలవడం జరిగింది.

అలాగే R. జెరూషా క్రిస్టినా, బెంగళూరు నందు ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఈ అమ్మాయి సౌత్ జోన్ సబ్ జూనియర్స్ నందు కాంశ్య పతకం సాధించడం జరిగింది. అలాగే కళాశాల నుండి కూడా పథకాలు సాధించినటువంటి విద్యార్థిని విద్యార్థులను ఈ సందర్భంగా వేదికపైకి ఆహ్వానించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమం నందు కళాశాల వ్యాయామ అధ్యాపకుడు శ్రీనివాసులు, NSS ప్రోగ్రాం ఆఫీసర్స్ సంజయ్ కుమార్, విజయానంద్ మరియు టీచింగ్, నాన్ టీచింగ్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Arattai