రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ తో గురువారం సాయంత్రం బి.జె.పి. రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ , ఆర్గనైజేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్.మధుకర్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆర్.ఎస్.ఎస్. చీఫ్ మోహన్ భగవత్ ఆదివాసీ యోధుడు బిర్సా ముండా గురించి రాసిన పుస్తకాన్ని పవన్ కల్యాణ్ కి అందించారు. వీటితోపాటు భారత భారతి సంస్థ స్వాతంత్ర్య సమరయోధుల జీవితాల గురించి ప్రచురించిన 175 పుస్తకాలను ఇచ్చారు.

బిర్సా ముండా జయంతి వేడుకల గురించీ, స్వదేశీ వస్తువుల వినియోగాన్ని విస్తృతం చేయడం గురించి ఉప ముఖ్యమంత్రి తో చర్చించారు.

Arattai