NANDYAL Feb10 :- నంద్యాల పట్టణంలో మహిళలు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకుంటామని ,భారీ జరిమానా విధిస్తామని పట్టణ ట్రాఫిక్ సీఐ చాంద్ భాష తెలిపారు.పట్టణంలో మహిళలు చాలామంది లైసెన్సు లేకుండా వాహనాలు నడుపుతున్నారని,వెంటనే లైసెన్స్ తీసుకోవాలని తెలిపారు.

మైనర్లు వాహనాలు నడిపిన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఇటీవల ఓ మహిళ లైసెన్స్ లేకుండా వాహనం నడిపి యాక్సిడెంట్ చేసిందని,దానివల్ల ఒకరు మృతి చెందారనితెలిపారు.
Arattai