NANDYAL April 29:- నంద్యాల పట్టణ శివారులోని పెద్ద కొట్టాల గ్రామంలో వెలసిన పరిశుద్ధ జేసు నామ కాథలిక్ చర్చ్ శతాబ్ది ఉత్సవాలను ఏప్రిల్ 30 నుండి మే 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రతిరోజూ ప్రత్యేక ప్రార్థనలు, ఆరాధన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సభలు నిర్వహించబడతాయని తెలిపారు.ఆటల పోటీలు, సాంస్కృతిక పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుండి ప్రముఖ పీఠాధిపతులు,గురువులు పాల్గొంటారని తెలిపారు.ఈ పవిత్ర వేడుకలకు పరిసర ప్రాంతాల నుండి విశ్వాసులు పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వాదాలు పొందాలని నిర్వాహకులు ఆహ్వానించారు.
Arattai