NANDYAL May02 :- దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల సమాఖ్యగా పేరుగాంచిన Association of Indian Universities (AIU) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 100వ వార్షిక సాధారణ సమావేశం (Annual General Body Meeting) మరియు వైస్ ఛాన్సలర్ల జాతీయ సదస్సు మహారాష్ట్ర రాష్ట్రంలోని పింపి, పుణేలోని Dr DY పాటిల్ విద్యాపీఠం ఉన్నత విశ్వవిద్యాలయంలో 2026 ఏప్రిల్ 28 నుండి 30 వరకు ఘనంగా నిర్వహించబడింది.

ప్రతిష్టాత్మక సమావేశానికి శ్రీ రామకృష్ణ విద్యా సంస్థకు ప్రత్యేక ఆహ్వానం లభించడం గర్వకారణంగా నిలిచింది. ఈ సమావేశానికి శ్రీ రామకృష్ణ విద్యా సంస్థ చైర్మన్ డా. జి. రామకృష్ణ రెడ్డి హాజరై, దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల ప్రతినిధులు, వైస్ ఛాన్సలర్లు, విద్యావత్తలు మరియు విధాన రూపకర్తలతో కలిసి ఉన్నత విద్యాభివృద్ధి పై చర్చల్లో పాల్గొన్నారు

ఈ సందర్భంగా ఉన్నత విద్యలో నాణ్యత పెంపు, నూతన విద్యా విధానాల అమలు, పరిశోధనాభివృద్ధి.డిజిటల్ విద్యా వనరుల వినియోగం, పరిశ్రమలతో అనుసంధానం (Industry- Academia Collaboration), మరియు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి వంటి ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల అనుభవాలు, ఉత్తమ పద్ధతులు (Best Practices) ఈ వేదికపై పంచుకోవడం జరిగింది.

డా. జి. రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతూ, ఇటువంటి జాతీయ స్థాయి సదస్సులు విద్యా రంగంలో సరికొత్త మార్గదర్శకాలు అందించడమే కాకుండా, విద్యాసంస్థల మధ్య సమన్వయాన్ని ఎంపొందిస్తాయని తెలిపారు

అలాగే, విద్యార్థులను గ్లోబల్ స్థాయిలో పోటీతత్వం కలిగినవారిగా తీర్చిదిద్దడానికి ఆధునిక విద్యా విధానాలు మరియు సాంకేతిక పరిజ్ఞానం వినియోగం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ సమావేశంలో పాల్గొనడం ద్వారా శ్రీ రామకృష్ణ విద్యా సంస్థకు గౌరవం పెరిగిందని, భవిష్యత్తులో సంస్థ మరింత ఉన్నత లక్ష్యాలను సాధించే దిశగా ఇది ప్రేరణనిస్తుందని కళాశాల చైర్మన్ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో దేశంలోని అనేక విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు విద్యా నిపుణులు మరియు పరిపాలనా ప్రతినిధులు పాల్గొని, ఉన్నత విద్యా రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం తమ సూచనలు, అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

V.రాజేంద్ర కుమార్
నంది న్యూస్ రిపోర్టర్
Arattai