NANDYAL May17:- ఆదివారం లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ, లయన్స్ జిల్లా ఫస్ట్ లయన్ లేడీ శ్రీమతి ఆరుణ దంపతుల నంద్యాల పర్యటన సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు సోమేశుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్ ల నిర్వహణలో,ఐ.ఎమ్. ఏ జాతీయ కేంద్ర కమిటీ సభ్యులు,లయన్స్ జిల్లా చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎం.పీ.వి. రమణయ్య, రీజియన్ చైర్మన్ సుధాకర రెడ్డి, జోన్ చైర్మన్ నిజాముద్దీన్ ల పర్యవేక్షణలో, నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో పట్టణంలో మూడు లక్షల రూపాయల వ్యయంతో సేవా కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహించారు.

బాలాజీ కళ్యాణమండపం లో నిర్వహించిన భారీ సేవా కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు లగి శెట్టి విజయ్ కుమార్ శెట్టి,రావుస్ విద్యా సంస్థల అధినేత అప్పారావు, రీజియన్ చైర్మన్ సుధాకర రెడ్డి, గురు రాజా స్కూల్ డైరెక్టర్ షేక్షావలి రెడ్డి, గురు రాఘవేంద్ర బ్యాంక్ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ మౌలాలి రెడ్డి, గోళ్ళ సుదర్శనం శెట్టి, రైల్వే రవి ప్రకాష్ , రైల్వే రామన్న, శ్రీరామ డిజిటల్ అధినేత చందా చంద్రమోహన్, రైల్వే వెంకటేశ్వర్ల సౌజన్యంతో 10 మోటార్ తో పనిచేసే కుట్టు మిషన్లను, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి, భవనాసి జువెలర్స్ నిర్వాహకులు భవనాసి నాగ మహేష్, మహేశ్వర ఆయిల్స్ అధినేత కుంచా మహేశ్వరరెడ్డి, ప్రసాద్ ఫిల్లింగ్ స్టేషన్ అధినేత కూర మురళీకృష్ణ ప్రసాద్, ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ బలుసా రాజీవ్, ఇమ్మడి వెంకట రామకృష్ణుడు, బాలాజీ విద్యా మందిర్ అధినేత ఆర్ల వెంకటస్వామి, రఘు రాముడు ల ఆర్థిక సహకారంతో 8 చక్రాల కుర్చీలు, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆంజనేయులు గుప్తా, జోన్ చైర్మన్ నిజాముద్దీన్,కూర మురళీకృష్ణ ప్రసాద్, రావుస్ కళాశాల కరస్పాండెంట్ మౌని, కశెట్టి చంద్రశేఖర్, దూదేకుల దస్తగిరి, బాల అకాడమీ అధినేత రవీంద్రనాథ్, నాగ వీరాంజనేయులు, రాహుల్ గ్రాఫిక్స్ చంద్రమౌళీశ్వర రెడ్డి,విరాళంతో 9 మంది బధిరులకు వినికిడి యంత్రాలు, రావుస్ కళాశాల ప్రిన్సిపల్ రొడ్డా సుంకయ్య, తోట శ్రీనివాసులు, హరి ప్రసాద్ ల సహకారంతో 7 జతల చంక కర్రలు దివ్యాంగులకు అందజేశారు.

అవ్వారు జువెలర్స్ తరఫున 5 వందల చేతి సంచులు,జీవనజ్యోతి అంధుల హాస్టల్ కు పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు సహకారంతో 100 కేజీల బియ్యం, హెచ్ఐవి లైఫ్ పరివర్తన సెంటర్ కు రైల్వే సుధాకర్ సహకారంతో ఆహార సరుకులు,సంఘమిత్ర బాలుర ఆవాస కేంద్రానికి బేకర్స్ పార్క్ అధినేత సవ్వా మనోహర్ రెడ్డి సహకారంతో మూడు వందల నోటు పుస్తకాలు, ఎయిమ్ ఫర్ సేవ బాలికల హాస్టల్ కు ప్రెస్టీజ్ షోరూం అధినేత శివకుమార్ రెడ్డి సౌజన్యంతో క్రీడా పరికరాలు గవర్నర్ చేతుల మీదుగా అందజేశారు.
నంద్యాల వికలాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ సహకారంతో దివ్యాంగుల హెల్త్ కార్డులు, ఆంధ్ర మెడికల్స్ బైసాని రమేష్ సౌజన్యంతో 15 మంది దివ్యాంగులకు నెలవారి మందులు అందజేశారు. గోళ్ళ సుదర్శనం శెట్టి సహకారంతో దివ్యాంగ మహిళకు ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ అందజేశారు.దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం వద్ద సోమేసుల నాగరాజు సౌజన్యంతో చలివేంద్రం ప్రారంభించారు.

నంద్యాల శివార్లలో పోసిన సిల్క్స్ అధినేత పోసిన సుబ్బారావు ఏర్పాటుచేసిన లయన్స్ క్లబ్ స్వాగత బోర్డ్ ను లయన్స్ గవర్నర్ గోపాలకృష్ణ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా లయన్స్ జిల్లా గవర్నర్ ఇల్లూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ నంద్యాల లయన్స్ క్లబ్ గత ఐదు దశాబ్దాల పైగా ప్రజలకు విస్తృత సేవలు అందిస్తున్న దని ప్రశంసించారు. భవిష్యత్తులో లయన్స్ క్లబ్ సేవలు మరింత విస్తృతం చేస్తామని అధ్యక్షులు సోమేశుల నాగరాజు ప్రకటించారు .ఈ కార్యక్రమాలలో లయన్స్ సభ్యులు డాక్టర్ సహదేవుడు, భవిరిశెట్టి శ్రీకాంత్,రవి ప్రకాష్, భవనాసి నాగ మహేష్, కశెట్టి చంద్రశేఖర్, ఎంపీ వి రమణయ్య,వివిధ సేవా కార్యక్రమాలకి సహకరించిన దాతలు, నంద్యాల లయన్స్ క్లబ్ సభ్యులు వారి కుటుంబాలతో పాల్గొన్నారు
Arattai