నంద్యాల పట్టణం,ప్రభుత్వ డిగ్రీ కళాశాల పనిచేస్తున్న రూకల శశికళ డాక్టరేట్ సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ యన్.శశికళ తెలిపారు.భౌతిక శాస్త్రంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నీటి వినియోగం అనే అంశంపై సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించినందుకు డాక్టరేట్ పొందినట్లు తెలిపారు.రాయలసీమ విశ్వవిద్యాలయ 4వ స్నాతకోత్సవంలో వైస్ ఛాన్స్లర్ మరియు గవర్నర్ చేతుల మీదుగా డాక్టరేట్ పట్టాను తీసుకున్నట్లు తెలిపారు

కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్ శశికళ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, ఇదే కళాశాలలో చదువుకుని, ఇదే కళాశాలలో ఉద్యోగం చేస్తూ, అత్యున్నత డిగ్రీ అయిన పిహెచ్.డి ని సాధించడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు. అధ్యాపకులు మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Arattai