పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం నందు ఆదివారం,నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ&అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ కమ్మరి పార్వతమ్మ, కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచార్యులు విశ్వకర్మ, గురు ప్రసాద్ విశ్వకర్మ,పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ&అభివృద్ధి కార్పొరేషన్ చైర్ పర్సన్ పార్వతమ్మ మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సంక్షేమ అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ ఆచారి నాగయ్య ఆచారి సూర్యప్రకాష్ ఆచారి చంద్రశేఖర్ ఆచారి కృష్ణమాచారి,పెద్ద సంఖ్యలో విశ్వబ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
Arattai