NANDYAL Nov 25:- చిరుధాన్యాల వినియోగం వల్ల మానవుల ఆరోగ్య జీవనశైలిలో అనేక అనుకూల జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో ప్రముఖ ఆహార శాస్త్రవేత్త, మిలెట్స్ మాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే డాక్టర్ ఖాదర్ వలీ గారిచే భారతీయ స్టేట్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్బిఐ రీజనల్ మేనేజర్ సూర్య ప్రకాష్, డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ, ఆర్ఎఆర్ఎస్ డైరెక్టర్ డా.జాన్సన్, నంద్యాల మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.సురేఖ, రిటైర్డ్ ప్రొఫెసర్ గంగిరెడ్డి, మిబుల్స్ వ్యవస్థాపకులు ఎ.వి.రామ్ సుబ్బారెడ్డి, ఎస్బిఐ బ్యాంకు సిబ్బంది, ఆరోగ్య అభిలాషులు, గృహిణులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తీక్ మాట్లాడుతూ, చిరుధాన్యాల వినియోగం మానవుల జీవనశైలిలో అనేక అనుకూల మార్పులను తీసుకురావడంతో పాటు ఆరోగ్య పరంగా కూడా ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. శారీరక, మానసిక వికాసానికి చిరుధాన్యాలు దోహదపడతాయని చెప్పారు.

మిల్లెట్స్ను ఆహారంలో చేరుస్తే రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుదల, ఎముకలకు బలాన్నందించడం వంటి ప్రయోజనాలు లభిస్తాయని తెలిపారు. వీటిలో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలున్నందున మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారికి చిరుధాన్యాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు.

అంతకుముందు డాక్టర్ ఖాదర్ వలి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య రక్షణకు సిరిధాన్యాలే మార్గమన్నారు. సిరి ధాన్యాలు భారతీయ ఆహార వ్యవస్థలో శతాబ్దాలుగా ఉన్న సంప్రదాయ ధాన్యాలు అని, ఆధునిక జీవనశైలి కారణంగా పక్కనపెట్టబడిన ఈ ధాన్యాల పునరాగమనమే భవిష్యత్తు ఆరోగ్య రక్షణకు మార్గమని పేర్కొన్నారు.

మధుమేహం, రక్తపోటు, కొవ్వు పెరుగుదల, హార్మోన్ అసమతౌల్యం, హృదయ రోగాలు వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో సిరి ధాన్యాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని శాస్త్రీయ ఉదాహరణలతో వివరించారు. సిరి ధాన్యాల సాగు పర్యావరణానికి అనుకూలమని, తక్కువ నీటితో మరియు తక్కువ వ్యయంతో పెంచవచ్చు కాబట్టి రైతులకు ఆర్థికంగా కూడా లాభదాయకమని తెలిపారు.

రసాయన ఎరువుల అవసరం లేకుండా సహజ పద్ధతుల్లోనే మంచి ఉత్పత్తి ఇచ్చే ఈ ధాన్యాలను ప్రోత్సహించడం ప్రభుత్వాలూ, రైతులూ, వినియోగదారులూ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలి అని సూచించారు. మనుషుల ఆరోగ్య శైలి, జీవన విధానాలు, చిరుధాన్యాల ప్రాముఖ్యత పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. అదే విధంగా కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిధులు కూడా చిరుధాన్యాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించారు.
అనంతరం జిల్లా ప్రతీకగా నిలిచిన నంది విగ్రహాన్ని పద్మశ్రీ డా. ఖాదర్ వలికి జాయింట్ కలెక్టర్ అందజేసి శాలువతో సత్కరించారు.
Arattai