NANDYAL May06 :- నంద్యాల జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) బలోపేతానికి మరో కీలక అడుగు పడింది. నంద్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీప ప్రాంగణంలో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి బుధవారం మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి , నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే గీతా జయసూర్య, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ తదితరులు పాల్గొని శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి, పునాది రాయి వేశారు. అనంతరం సర్వమత ప్రార్థనను నిర్వహించారు.. ఈ ప్రార్ధన లో పాల్గొన్న ముస్లిం, క్రిస్టియన్ ,హిందూ మత పెద్దలకు నూతన వస్త్రాలు మంత్రులు , ఎమ్మెల్యేలు అందజేశారు

ఈ సందర్భంగా మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నంద్యాల జిల్లా ఏర్పడినప్పటి నుండి పార్టీకి ఒక శాశ్వత భవనం లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని . ఈ నూతన కార్యాలయ నిర్మాణంతో ఆ లోటు తీరపోతుందన్నారు. పార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఇది ఒక వేదికగా నిలుస్తుందని . ఇకపై పార్టీకి సంబంధించిన అన్ని రాజకీయ కార్యకలాపాలు, సమీక్షా సమావేశాలు మరియు ప్రజల సమస్యల పరిష్కార వేదికగా ఈ భవనం సేవలందిస్తుందని తెలిపారు.

జిల్లాలోని ఏడు నియోజకవర్గాల కార్యకర్తలకు సమన్వయ కేంద్రంగా ఈ కార్యాలయం పనిచేస్తుందని అన్నారు . అత్యాధునిక వసతులతో కూడిన ఈ భవనాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఈ భూమి పూజ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు ధర్మవరం సుబ్బారెడ్డి, పార్వతమ్మ, విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్, డైరెక్టర్లు తులసి రెడ్డి, మునియార్ ఖలీల్, ఉప్పరి సురేష్ కుమార్, నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, సెంట్రల్ ఫుడ్ కమిటీ మెంబర్ విశ్వనాథరెడ్డి మరియు స్థానిక పార్టీ నాయకులు, మార్కెట్ కమిటీ ప్రతినిధులు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Arattai