NANDYAL July18:- పి ఎస్ సి అండ్ కె వి ఎస్ సి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నంద్యాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వి జె శైలజా రాణి అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కోఆర్డినేటర్ కే శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్ అలాగే ఎన్ సి సి సమన్వయంతో కళాశాల యందు ప్రతినెల నిర్వహించేటటువంటి స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని కళాశాల యందు విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది సమావేశపరిచి వారి చేత స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు.

ఈ నెల యొక్క ప్రత్యేకత స్వర్ణాంధ్ర స్వచ్ఛత గురించి అందరికీ అవగాహన కల్పించి మన యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవలసినటువంటి ఆవశ్యకత గురించి ఈ సందర్భంగా వైస్ ప్రిన్సిపాల్ విద్యార్థిని విద్యార్థులు మరియు కళాశాల సిబ్బందిని ఉద్దేశించి ప్రసంగించారు రాబోయేది వర్షాకాలం కాబట్టి పరిసరాల పరిశుభ్రతను పాటించడం ఎంతో అవసరమని అపరిశుభ్రంగా ఉండడం ద్వారా అంటూ వ్యాధులు ప్రభలే అవకాశం ఉందని కాబట్టి మీ యొక్క పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విద్యార్థులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని కళాశాల ఆవరణాన్ని శుభ్రపరిచారు
Arattai