VIJAYAWADA May20 :- మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని బుధవారం విజయవాడ,తాడేపల్లి క్యాంపు ఆఫీస్ నందు వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చింతమాని లాలి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు రాష్ట్రస్థాయి పదవి అప్పగించినందుకు జగన్మోహన్ రెడ్డికి లాలి స్వామి కృతజ్ఞతలు తెలిపారు.

పార్టీ అభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని జగన్ సూచించినట్లు లాలి స్వామి తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేయడానికి బీసీ సెల్ నుంచి అన్ని స్థాయిల్లో కృషి చేస్తామని లాలి స్వామి వ్యాఖ్యానించారు.ఈ సమావేశంలో మాజీ పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి,బండి ఆత్మకూరు మాజీ JCS కన్వీనర్ ముడిమెలా పుల్లారెడ్డి పాల్గొన్నారు

Arattai