NANDYAL A{ri: 15 :- తెలుగుదేశం పార్టీకి తొలి మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శిగా నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని టీడీపీ ప్రకటించడం, పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణకు ముందు ఒక పెద్ద సందేశం ఇచ్చినట్లయింది. తెలుగుదేశం పార్టీలో భారీ మార్పులో భాగంగా, టీడీపీ తన తొలి మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బైరెడ్డి శబరిని అధికారికంగా ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ టీమ్ లోకి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రసిడెంట్ గా రాష్ట్ర మంత్రి, నారా లోకేష్ ను ప్రకటించి, నారా లోకేష్ టీంలోకి తొలి మహిళా జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరిని నియమించడం ప్రత్యేకం.
నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరిని టీడీపీ జాతీయ ప్రధాన కార్య దర్శిగా నియమిస్తూ టీడీపీ అధిష్టానం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కి కీలక పదవి వరించడంతో నంద్యాల పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో డాక్టర్ బైరెడ్డి శబరి అనుచరులు, అభిమానులు, శ్రేయోభిలాషులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.ప్రధాన కార్యదర్శిని ప్రకటించింది. ఎంపీ రామ్ మోహన్ నాయుడు, కిలారు రాజేష్లతో పాటు డాక్టర్ బైరెడ్డి శబరిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించారు.
Arattai